విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్లో దూరి కరిచిన ఎలుక
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైన అరుణ్ మోదీ అనే వ్యక్తి ప్యాంటులో ఎలుక దూరి కరిచింది. తోటి ప్రయాణికుల సాయంతో ఎలుకను పట్టుకుని విమానాశ్రయ సిబ్బందికి అప్పగించారు. అనంతరం అతను బెంగళూరుకు ప్రయాణించారు.
ఇటీవల దేశంలోని విమానాశ్రయాలలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ విమానాశ్రయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అరుణ్ మోదీ అనే వ్యక్తి బెంగళూరు వెళ్లడానికి ఇండిగో విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. డిపార్చర్ హాల్లో వేచి చూస్తుండగా ఆయన ప్యాంటులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. పరిశీలించగా ఎలుక లోపలికి దూరి కరుస్తుందని గుర్తించాడు. వెంటనే అతను తన భార్య, ఇతర ప్రయాణికుల సహాయంతో ప్యాంటు విప్పి ఎలుకను పట్టుకున్నాడు. ఆ ఎలుక తొడను కరిచింది. పట్టుకున్న ఎలుకను కవర్లో ఉంచి విమానాశ్రయ సిబ్బందికి అప్పగించారు. అక్కడ రేబిస్ ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అరుణ్ బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు విమానాశ్రయంలో రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నారు. భోపాల్కు చెందిన అరుణ్ హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాట్జీపీటీ సాయంతో రూ. 1.32 కోట్ల లాటరీ గెలిచిన మహిళ
Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు
గ్యాస్ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే
కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు

