అద్భుతం.. శ్రీకృష్ణుడి విగ్రహానికి చూపులేని లేగ ప్రదక్షిణలు

Updated on: Oct 21, 2025 | 8:00 PM

హైదరాబాద్‌ నగర శివారులోని బాటసింగారం వద్ద గల జాఫర్‌గూడలో ఒక ఆశ్చర్య ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. చూపులేని ఒక లేగదూడ ప్రతి రోజు శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విశేషం ‘యుగతులసి ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గో మహాక్షేత్రంలో జరుగుతోంది. సుమారు రెండేళ్ల వయసున్న ఈ లేగదూడకు ‘సంధ్య’ అని పేరు పెట్టారు.

ఫౌండేషన్‌ సభ్యులే ఈ దృశ్యాన్ని రోజూ అది చేస్తోన్న పని చూసి ఆశ్చర్యపోతున్నారు. రెండేళ్ల క్రితం కబేళాకు తరలిస్తున్న ఓ గోమాతను తాము రక్షించామని ఫౌండేషన్‌ ఛైర్మన్‌, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్‌ తెలిపారు. కొన్ని రోజులకే ఆ గోమాత ఈ లేగదూడకు జన్మనివ్వగా దానికి .. సంధ్య అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. చూపులేని ఈ లేగదూడ గోమహాక్షేత్రంలోని శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రతి ఉదయం,సాయంత్రం సమయాల్లో దాదాపు 15 నిమిషాల పాటు ప్రదక్షిణలు చేస్తోంది. దానికి అలా చేయడాన్ని ఎవరూ శిక్షణ ఇవ్వలేదని ఆయన వివరించారు. ఈ దృశ్యాన్ని శివకుమార్‌ స్వయంగా వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా, అది క్షణాల్లో వైరల్‌ అయింది. చాలా మంది ఈ దృశ్యాన్ని చూసి.. ఇది భక్తి, దైవానుగ్రహం కలిసిన అరుదైన సంఘటన అని కామెంట్లు చేస్తున్నారు.‘నందగోకులం’ పేరుతో గోమహాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కుటీరంలో ఈ లేగదూడ సంధ్యను సంరక్షిస్తున్నారు. ప్రతిరోజూ భక్తి భావంతో శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ తిరుగుతున్న ఈ దూడను చూసి.. ఆ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dil Raju: బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న దిల్ రాజు

Sudheer Babu: సుధీర్ బాబు కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీ

ఫైనల్ రిపోర్ట్‌.. దర్శన్‌కు బిగ్ ఝలక్

Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్‌ బ్లాస్ట్

ఈ దీపావళి రష్మికకు ఎందుకంత స్పెషల్‌