సంచలన నిర్ణయం.. ఇకపై అమ్మాయిలు ఫోన్‌ వాడటంపై నిషేధం

Updated on: Mar 03, 2023 | 9:52 PM

టెక్నాలజీ పెరిగాక.. సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ చిన్న పెద్దా తేడా లేకుండా అందరి చేతుల్లో ఉంటోంది.

టెక్నాలజీ పెరిగాక.. సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ చిన్న పెద్దా తేడా లేకుండా అందరి చేతుల్లో ఉంటోంది. అయితే అమ్మాయిలు మొబైల్ వాడటం వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయంటున్నారు ఓ కమ్యూనిటీ పెద్దలు. దీంతో అమ్మాయిలు మొబైల్ వాడటంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా ఓ ఎమ్మెల్యే సాక్షిగా తీర్మానం చేశారు. దీంతో మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్‌లోని ఠాకూర్ కమ్యూనిటీ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కులానికి చెంది కుటుంబాల జీవితంలో మెరుగుదల కోసం సెల్ ఫోన్ వాడకంపై విధించింది. ఇందులో భాగంగా అమ్మాయిలు మొబైల్ వాడకూడదనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం పట్ల అక్కడి అమ్మాయిలు కోపంతో రగిలిపోతున్నారు. నేటి సమాజంలో లింగ బేధాలు లేకుండా ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా మహిళలు ఎదుగుతుండగా.. ఠాకూర్ కమ్యూనిటీ ఇలాంటి ఉత్తర్వులు జారిచేయడంతో మహిళలు మండిపడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్

Digital TOP 9 NEWS: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా? | 19 ఏళ్లకే వృద్ధాప్యం

Manchu Manoj Marriage: అంగరంగ వైభవంగా మంచు వారి ఇంట పెళ్లి సందడి.. లైవ్ వీడియో

Published on: Mar 03, 2023 09:52 PM
Loading...
Unable to load recommendations.
Follow Us