రీల్స్ కోసం వెళ్లి..వందే భారత్ ఢీకొట్టి నలుగురు మృతి వీడియో
బీహార్లోని పూర్నియా-కస్పా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొని నలుగురు యువకులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున రైలు పట్టాల వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రీల్స్ పిచ్చి ప్రమాదాలపై ఆందోళన రేకెత్తిస్తోంది.
రీల్స్ సరదా బీహార్ రాష్ట్రంలో నలుగురు యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన శుక్రవారం బీహార్లోని పూర్నియా, కస్పా రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.పూర్నియా సమీపంలోని గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు తెల్లవారుజామున రీల్స్ చేసేందుకు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఉదయం సమయంలో ఆ మార్గంలో వందే భారత్ రైలు వస్తుందని తెలిసి, రైలు తమ వీడియోలో వచ్చే విధంగా చిత్రీకరించేందుకు చీకట్లోనే అక్కడికి చేరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి
టప టపా పేలిపోయిన సెల్ ఫోన్లు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు!
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. కోట్లు దండుకొని పరార్!
17 ఏళ్ళ తరువాత పెద్దమ్మ తల్లి దేవర ... కళ్ళు చెదిరే దృశ్యం
మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు
హలీం ధరకు రెక్కలు..సింగిల్ ప్లేట్ ఏకంగా..

