Maharashtra: నాలుగేళ్ల బాలిక సాహస యాత్ర.. కాలినడకన 3,500 కి.మీ..! వైరల్ వీడియో.

Updated on: Dec 23, 2022 | 9:40 AM

పేరు రాజేశ్వరగిరి.. వయసు నాలుగేళ్లు.. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలసి అరుదైన యాత్ర చేపట్టింది. బుడిబుడి అడుగులు వేస్తూ నర్మదా నది చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తోంది. నర్మదా నది పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం..


పేరు రాజేశ్వరగిరి.. వయసు నాలుగేళ్లు.. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలసి అరుదైన యాత్ర చేపట్టింది. బుడిబుడి అడుగులు వేస్తూ నర్మదా నది చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తోంది. నర్మదా నది పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం… దీని కారణంగా, ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు నర్మదా పరిక్రమ పేరుతో నది చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే మొదటిసారిగా నాలుగేళ్ల చిన్నారి రాజేశ్వరగిరి.. నర్మదా నది చుట్టూ 3,500 కి.మీ. ప్రదక్షిణ చేసేందుకు సిద్ధమైంది. రాజేశ్వరగిరి మహారాష్ట్ర నుండి నర్మదా పరిక్రమపైకి వచ్చి ఖర్గోన్ జిల్లా కేంద్రానికి 80 కి.మీ దూరంలోని బార్వాకు చేరుకుంది. అక్టోబరు 12న ప్రారంభమైన యాత్ర ఇంకా కొనసాగుతోంది. బాలిక తన తల్లి అర్చనట్యగిరి, భూషణ్ శ్రీమంత్ మషాల్, స్వరమలా షిండే, గణేష్ షిండేలతో కలిసి ఆరుగురు సభ్యుల బృందంతో పాదయాత్ర చేస్తోంది. కాలినడకన రోజూ 25 కి.మీ. ప్రదక్షిణ చేస్తోంది ఈ బృందం. మార్గమధ్యంలో రాళ్లూరప్పలు, ముళ్లపొదలను దాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ చిన్నారిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు రాజేశ్వరగిరి రెండు నెలల ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ ప్రదక్షిణ మరో రెండు నెలల పాటు సాగనుందని పాప కుటుంబ సభ్యులు చెప్పారు. చలిలో నర్మదా మయ్య పట్ల ఆడబిడ్డకు ఉన్న అచంచల విశ్వాసం కనిపిస్తుంది. బాలిక రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వాహనంలో నర్మద పరిక్రమ చేసింది. ఈ ఏడాది ఆమె తన తల్లితో కలిసి వాకింగ్ టూర్‌కు వెళ్లింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 23, 2022 09:40 AM
Follow Us