బస్సు ప్రమాదానికి క్యాబిన్లో మొబైల్ ఫోన్లే కారణమా? వీడియో
కర్నూలు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషణ చేస్తున్నాయి. లగేజ్ క్యాబిన్లో పెద్ద ఎత్తున ఉన్న మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడమే ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణమని నిపుణులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ఈ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాల విశ్లేషణ కొనసాగుతోంది. ఈ ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలపై అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బస్సు లగేజ్ క్యాబిన్లో పెద్ద ఎత్తున తరలించిన మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలడమే భారీ ప్రాణనష్టానికి కారణమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు క్యాబిన్లో ఉండటం వల్లే ప్రమాద స్థాయి పెరిగిందని వారి విశ్లేషణలో వెల్లడైంది.ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లగేజ్ క్యాబిన్లో ఏం తరలిస్తున్నారో ఈ సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని, ప్రమాదకర వస్తువులను తరలించకూడదన్న నిబంధనలను ఎందుకు ఉల్లంఘించాయో అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
