నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో హృదయవిధారక దృశ్యాలు.. తేలియాడుతున్న సగం కాలిన మృతదేహాలు.. వీడియో

Updated on: Sep 11, 2021 | 9:46 AM

ఆ వైకుంఠదామంలో దారుణ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కట్టెకాలకుండానే సగం కాలిన మృతదేహాలు గోదావరి వరదల్లో కొట్టుకుపోతున్నాయి‌. చివరి మజిలిలోనూ నరకయాతన అనుభవింపచేసే దృశ్యాలు కుటుంబ సభ్యులను కలిచి వేస్తున్నాయి.

ఆ వైకుంఠదామంలో దారుణ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కట్టెకాలకుండానే సగం కాలిన మృతదేహాలు గోదావరి వరదల్లో కొట్టుకుపోతున్నాయి‌. చివరి మజిలిలోనూ నరకయాతన అనుభవింపచేసే దృశ్యాలు కుటుంబ సభ్యులను కలిచి వేస్తున్నాయి. బంధువుల కళ్లెదుటే సగం కాలిన మృతదేహాలు కొట్టుకుపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వైకుంఠదామంలో చోటు చేసుకుంటున్న ఘటనలివి.నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటి పరిధిలోని గోదావరి నది ఒడ్డున నిర్మాణమైన వైకుంఠదామంలో నిత్యం ఏదో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంటుంది. అంత్యక్రియలకు వచ్చిన మృతదేహాలు గోదావరి వరద ప్రవాహానికి పూర్తిగా కాలకుండానే కొట్టుకుపోతున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: సింహానికే షాకిచ్చిన జింకపిల్ల.. ఫిదా అవుతున్ననెటిజన్లు.. వీడియో

Satellite Internet: ఇకపై జెట్‌ స్పీడులో ఇంటర్నెట్ సేవలు.. మారుమూల పల్లెల్లోనూ నెట్‌ పరుగులు.. వీడియో

Follow Us