నాన్న, అంకుల్ దుబాయ్‌ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

Updated on: Mar 03, 2026 | 2:01 PM

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో దుబాయ్‌లో పది వేల మందికి పైగా భారతీయులు, తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 1800 మంది చిక్కుకుపోయారు. 48 గంటల పాటు విమాన సేవలు రద్దవడంతో వీసా గడువు ముగిసిన వారికి పొడిగింపు, ఆశ్రయం కల్పిస్తున్నారు. కుటుంబాలు ఆందోళన చెందుతుండగా, సురక్షిత తరలింపుపై అధికారులు హామీ ఇస్తున్నారు.

ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పశ్చిమాసియా మొత్తాన్ని ఉద్రిక్తంగా మార్చింది. ఈ పరిణామాల మధ్య దుబాయ్‌లో పది వేల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు, వారిలో తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 1700 నుండి 1800 మంది ఉన్నారు. దుబాయ్ ఎయిర్‌స్పేస్ 48 గంటల పాటు మూసివేయబడటంతో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. వీసా గడువు ముగిసిపోతున్న వారికి దుబాయ్ ప్రభుత్వం వీసాలను పొడిగిస్తోంది. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారికి స్థానిక ఆశ్రయాలు కల్పిస్తోంది. దుబాయ్ పోలీస్, డిఫెన్స్ దళాలు డ్రోన్‌లు, క్షిపణులను అడ్డుకుంటున్నప్పటికీ, వాటి శకలాలు నష్టాన్ని కలిగిస్తున్నాయి, ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో. దుబాయ్‌లో ఉన్న తమ బంధువుల భద్రత పట్ల ఇక్కడి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

Follow Us