మహిళ కడుపులో కత్తెరలు !! ఎలా చేరాయో తెలిస్తే !!

|

Oct 14, 2022 | 8:58 AM

వైద్యులను దేవుళ్లుగా భావిస్తారు ప్రజలు. వారికి చేతులెత్తి మొక్కుతారు. అలాంటి వైద్యులే వారి నిర్లక్ష్యం కారణంగా రాక్షసులుగా మారతారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ కోజికొడ్‌లో జరిగింది.

వైద్యులను దేవుళ్లుగా భావిస్తారు ప్రజలు. వారికి చేతులెత్తి మొక్కుతారు. అలాంటి వైద్యులే వారి నిర్లక్ష్యం కారణంగా రాక్షసులుగా మారతారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ కోజికొడ్‌లో జరిగింది. కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళకు సర్జరీ చేసి ఆమె కడుపులో కత్తెరలు పెట్టి కుట్టేశారు. కోజికొడ్‌కు చెందిన 30ఏళ్ల హ‌ర్షిదా ఐదు సంవ‌త్సరాలుగా క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతోంది. గత ఆరు నెలలుగా నొప్పి మ‌రింత ఎక్కువ కావ‌డంతో తగ్గడానికి వైద్యులు ఆమెకు బలమైన యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. అయినా త‌గ్గక‌పోవ‌డంతో ఇటీవ‌ల ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు స్కానింగ్ చేసి, ఆమె కడుపులో రెండు క‌త్తెర‌లు ఉన్నట్టు గుర్తించారు. ఆ ఫోర్సెప్స్ ఐదేళ్లుగా హ‌ర్షిదా క‌డుపులో ఉన్నాయి. వాటిని అలా వ‌దిలేసింది కూడా ఇదే కోజికోడ్ మెడిక‌ల్ కాలేజీ వైద్యులు కావ‌డం మ‌రో విశేషం. ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్సల సమయంలో రక్తస్రావ నాళాలను బిగించడానికి సర్జన్లు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. హ‌ర్షిదా 2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీలో మూడోసారి సిజేరియన్ చేయించుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటికి కాపలా కాస్తున్న భారీ నాగుపాము !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు !!

Follow us on