టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు​

|

Nov 09, 2023 | 8:48 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో సర్జరీ చేయటానికి వెళ్లిన ఓ డాక్టర్ సర్జరీ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చేశాడు. ఆపరేషన్​ కోసం వచ్చిన నలుగురు మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్​రామ్​ భలవి.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో సర్జరీ చేయటానికి వెళ్లిన ఓ డాక్టర్ సర్జరీ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చేశాడు. ఆపరేషన్​ కోసం వచ్చిన నలుగురు మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్​రామ్​ భలవి. సర్జరీ చేయటానికి వెళ్లే ముందు టీ కోసం అక్కడ వాళ్లని అడిగారు వైద్యుడు. అయితే ఎవరూ డాక్టర్​కు టీ ఇవ్వలేదు. ఈ క్రమంలో డాక్టర్ తేజ్​రామ్​ సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్​కు వెళ్లాడు. నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు. టీ ఇవ్వలేదనే కోపంతో డాక్టర్ సర్జరీ చేయకుండానే ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆపరేషన్​ కోసం మత్తు మందు ఇచ్చిన నలుగురు మహిళలు ఎదురుచూడాల్సి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి !!

Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం

చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్‌ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు

 

Follow us on