వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

Updated on: Jul 28, 2026 | 7:26 PM

ఢిల్లీకి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సుమీ సియాగ్ అగ్గిపెట్టెలతో రూపొందించిన వినూత్న అటెండెన్స్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు తమ హాజరును తామే నమోదు చేసుకునేలా రూపొందించిన ఈ విధానం ద్వారా బాధ్యత, స్వీయ క్రమశిక్షణ పెంపొందుతోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోకు ఇప్పటికే 2.7 కోట్లకు పైగా వీక్షణలు లభించాయి.

పిల్లల్లో సృజనాత్మకత, బాధ్యత, స్వీయ క్రమశిక్షణ పెంచడానికి.. ఖరీదైన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు అవసరం లేదని ఢిల్లీకి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సుమీ సియాగ్ నిరూపించారు. రోజూ హాజరు పిలిచే సంప్రదాయ పద్ధతికి బదులుగా ఆమె అగ్గిపెట్టెలతో తయారు చేసిన వినూత్న ‘అటెండెన్స్ బోర్డు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ టీచర్‌.. ఒక చార్ట్‌పై ప్రతి విద్యార్థి ఫొటోతో ఉన్న అగ్గిపెట్టెలను అమర్చారు. అగ్గిపెట్టె బయట ‘A’ అంటే ఆబ్సెంట్, లోపలి స్లైడ్‌పై ‘P’ అంటే ప్రెసెంట్ అని రాసి ఉంటుంది. స్కూల్‌కు రాగానే విద్యార్థులు తమ ఫొటో ఉన్న అగ్గిపెట్టెను స్లైడ్ చేస్తారు. దాంతో ‘A’ అక్షరం కప్పబడి ‘P’ బయటకు కనిపిస్తుంది. ఈ చిన్న ప్రక్రియ ద్వారా పిల్లలు తమ హాజరును తామే నమోదు చేసుకుంటూ, చిన్నతనం నుంచే స్వీయ క్రమశిక్షణ, బాధ్యతను అలవర్చుకుంటున్నారు. ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియోను సుమీ సియాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా దాదాపు 2.7 కోట్ల మంది వీక్షించారు. చదువుతో పాటు జీవితంలో ఉపయోగపడే విలువలను నేర్పించే ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు ప్రతి పాఠశాలలోనూ ఉండాలని విద్యావేత్తలు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us