Gaganyaan – ISRO: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు.. అదేంటంటే.?

Updated on: Feb 24, 2024 | 4:42 PM

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో ఎక్స్‌ ఖాతాలో అప్‌డేట్‌ ఇచ్చింది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు వినియోగించే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌లో దీనిని వాడనున్నారు.

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో ఎక్స్‌ ఖాతాలో అప్‌డేట్‌ ఇచ్చింది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు వినియోగించే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌లో దీనిని వాడనున్నారు. సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ గగన్‌యాన్‌లో మానవ ప్రయాణానికి అనువైనదిగా రుజువైందనీ ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొందనీ ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే ఎల్‌వీఎం3 జీ1 లాంచ్‌ వెహికిల్‌ కు పరీక్షలు పూర్తయ్యాయి అని ఇస్రో తెలిపింది. గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను నింగిలో 400 కిలోమీటర్ల ఎత్తున్న కక్ష్యలోకి పంపి మళ్లీ వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఈ ప్రయోగం ఇస్రో 2030లో చేపట్టనుం‍ది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Loading...
Unable to load recommendations.
Follow Us