మహారాష్ట్రలో విషాదం.. భజన చేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిన బాబా.. వీడియో

|

Oct 02, 2021 | 9:44 AM

మహారాష్ట్రలో విషాద సంఘటన జరిగింది. అప్పటి వరకు భక్తులందరి ముందు భక్తి పారవశ్యంతో భగవంతుని భజన చేసిన ఓ బాబా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆందోళన చెందిన భక్తులు ఏమైందా?

మహారాష్ట్రలో విషాద సంఘటన జరిగింది. అప్పటి వరకు భక్తులందరి ముందు భక్తి పారవశ్యంతో భగవంతుని భజన చేసిన ఓ బాబా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆందోళన చెందిన భక్తులు ఏమైందా? అని చూస్తే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు అర్థమైంది. దీంతో బాబాను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యంలోనే బాబా కన్నుమూశారు. ఈ ఘటన మహారాష్ట్ర నిజాంపూర్ సమీపంలోని జామ్దాలో జరిగింది. సెప్టెంబర్‌ 27న ఇక్కడ జరిగిన ఒక భజన కార్యక్రమానికి కీర్తంకర్ తాజుద్దీన్ బాబా హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రంథరాజ్ జ్ఞానేశ్వరి మహరాజ్ పారాయణ సప్తాహ్ ఆలపించడం ప్రారంభించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: క్లాస్‌ రూంలో టీచర్ల నృత్యాలు..!! సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

చిట్టీల పేరుతో ఖాకీలకే కుచ్చు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు.. వీడియో

 

Follow us on