ఒడ్డుకు కొట్టుకొచ్చిన డూమ్స్ డే చేప.. ఇక విధ్వంసమేనా? వీడియో
మహా సముద్ర గర్భంలో నివసించే అత్యంత అరుదైన డూమ్స్ డే ఫిష్ తాజాగా ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకు వచ్చింది. ఒడ్డుకు చేరి చనిపోయి కనిపించింది. సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలకు దారితీస్తుంది. ఈ చేప కనిపించటం ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని జపనీయులు అంటున్నారు. గతంలో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందుకు ఇవి కనిపించాయని చెబుతున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్ లోతు దాదాపు 10,984 మీటర్లు అంటే దాదాపు 11 కిలోమీటర్లు ఎవరెస్ట్ శిఖరానికి అడుగు భారం నుంచి పెకిలించి ఇక్కడ వేస్తే అది రెండు కిలోమీటర్ల సముద్ర జలాల్లో లోతున మునిగిపోయింది. సూర్యకిరణాలు సముద్రంలోకి వెయ్యి మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే బ్లాక్ సీ డెవిల్యాంగలర్ ఫిష్ డూమ్స్ డే అనేక రకాల చేపలు మహా సముద్రాల లోతులో జీవిస్తూ ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. ఈ చేప తాజాగా సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. రిబ్బన్ ఆకారంలో పొడవైన లాంటి శరీరం మెరిసే పొలుసులు కలిగిన డూమ్స్ డే ఫిష్ లోతైన సముద్ర జీవి తాజాగా ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకుని వచ్చి ఆశ్చర్యంలో ముంచుతుంది.
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

