తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం.. అబ్బా అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు..
మంచిర్యాల జిల్లాలోని ముల్కల గ్రామంలో సింహవాహిని దుర్గామాత విగ్రహం బయటపడింది. గోదావరి ప్రదక్షిణ యాత్రలో ఉన్న సాధుసంతుల సూచనతో తవ్వకాలు జరపగా, ఈ విగ్రహం లభ్యమైంది. విజయవాడ దుర్గమ్మ తరహాలోనే తెలంగాణలో ఈ అమ్మవారు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మంచిర్యాల జిల్లా, హజీపూర్ మండలం ముల్కల గ్రామంలో ఇటీవల దుర్గామాత విగ్రహం వెలుగులోకి వచ్చింది. గతంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం, ఈ అద్భుత ఆవిష్కరణతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గోదావరి పరిక్రమ యాత్రకు వచ్చిన సాధుసంతులు, ఈ ప్రాంతంలో మహిమాన్విత అమ్మవారు ఉన్నారని చెప్పడంతో, ఓ ప్రైవేట్ భూమిలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో సింహవాహిని అలంకారంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. అమ్మవారు బయటపడిన వార్త వ్యాపించడంతో, భక్తులు పెద్ద ఎత్తున ముల్కలకు తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ విగ్రహావిష్కరణతో ఈ ప్రాంతం త్వరలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని స్థల యజమాని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్లైన్లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ