Viral: కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

|

Apr 16, 2024 | 7:49 PM

తరచూ పొలాల్లో, ఉపాధిహామీ కూలి పనుల్లో కారి్మకులు తరచూ పాము కాట్లకు గురవుతూ ఉంటారు. ఆ సమయంలో కొందరు సామును చంపేస్తుంటారు. కొందరు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చి పామును సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఇటీవల పాముకాట్లకు గురవుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఉపాధిహామీ కూలి పనులకోసం వెళ్లిన ఓ మహిళ పాముకాటుకు గురైంది.

ములుగు జిల్లా వెంకటాపురం లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఉపాధిహామీ కూలి పనులకు వెళ్లింది. అక్కడ ప్రమదావశాత్తూ పాముకాటుకు గురైంది. కూలి పనులు చేస్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ పాము ఆ మహిళను కాటు వేసింది. అయితే ఆ మహిళ ఏమాత్రం ఖంగారు పడకుండా.. భయపడకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆమె ఒక్కతే వెళ్లలేదు.. పనిలో పనిగా తనను కాటు వేసిన పాముని కూడా తీసుకెళ్లింది. అయితే ఆ పామును సజీవంగా కాకుండా చంపి డబ్బాలో సెట్టుకొని వెటపెట్టుకొని ఆస్పత్రికి వెళ్లింది. శాంతమ్మ చేతిలో పామును చూసి ఖంగు తిన్నారు వైద్యులు. ఎందుకిలా చేశాని అడిగితే తనను ఏ పాము కరిచిందో డాక్టర్లకు తెలియాలి కదా అని చెప్పింది శాంతమ్మ. ఇక ఆలస్యం చేయకుండా శాంతమ్మ తెచ్చిన పాము విషపూరితమైందిగా గుర్తించి వెంటనే చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన నెట్టింట చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాంతమ్మ ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్‌ అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us on