చిత్తూరులో దారుణం.. ఉద్యోగం రాగానే పాత పెళ్లాం వద్దంటూ గెంటేసిన భర్త ! వీడియో

|

Sep 23, 2021 | 9:20 AM

మనిషికో ఆలోచన.. పుర్రెకో బుద్ధి అన్నట్లు ఓ ప్రబుద్ధుడు ఉద్యోగం రాగానే పెళ్లాం పాతదైపోయిందంటూ బయటకు గెంటేశాడు. పదేళ్లపాటు కాపురం చేసిన భార్యను ముగ్గురు పిల్లలతో సహా బయటకు గెంటేశాడు.

మనిషికో ఆలోచన.. పుర్రెకో బుద్ధి అన్నట్లు ఓ ప్రబుద్ధుడు ఉద్యోగం రాగానే పెళ్లాం పాతదైపోయిందంటూ బయటకు గెంటేశాడు. పదేళ్లపాటు కాపురం చేసిన భార్యను ముగ్గురు పిల్లలతో సహా బయటకు గెంటేశాడు. దాంతో న్యాయం చేయాలంటూ సదరు మహిళ ఆందోళనకు దిగింది. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన కళావతిని, గుండావారి పల్లికి చెందిన రామాంజులు పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు పుట్టారు. ఇప్పటి వరకూ అతనికి ఉద్యోగం లేదు. ఆ పనీ, ఈ పనీ చేసుకుంటూ భార్య, భర్తలిద్దరూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే తాజాగా రామాంజులుకి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దాంతో మనోడి బుద్ధి మారింది… భార్య పాతగా కనిపించింది..ఆమెకు చదువు లేదన్న విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.. కొత్త భార్య కావాలనిపించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: chandramukhi 2: సెట్స్ మీదకు చంద్రముఖి 2.. రంగంలోకి దిగిన లారెన్స్..! వీడియో

Taliban: పిల్ల చేష్టలంటే ఇవే.. మొన్న జూలో.. నేడు బోట్లల్లో.. తాలిబన్ల ఫొటోలు వైరల్‌ వీడియో

Follow us on