Train Accident: ముందు పేలుడు.. ఆపై అంతా చీకటి.. దిబ్రూగఢ్ రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!

|

Jul 22, 2024 | 3:53 PM

చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని గోండా సమీపంలో మోతీగంజ్-ఝిలాహీ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి ముందు పేలుడు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ వెంటనే రైల్లో చీకటి అలముకుని, గందరగోళం తలెత్తినట్టు చెప్పారు.

చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని గోండా సమీపంలో మోతీగంజ్-ఝిలాహీ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి ముందు పేలుడు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ వెంటనే రైల్లో చీకటి అలముకుని, గందరగోళం తలెత్తినట్టు చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎంపీ కృతి వర్ధన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనపై రైల్వే అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించింది. కాగా, ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. రైల్వేలో భద్రత లోపించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు యాంటీ కొలీషన్ వ్యవస్థ కవచ్‌ను రైళ్లలో ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on