కోతికోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న చిరుత..ఏం జరిగిందంటే ??

|

Nov 05, 2023 | 9:53 PM

ఆహారం కోసం కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ చిరుత పులి, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కోతిపైకి దూకిన చిరుత ట్రాన్స్‌ఫర్‌పై పడి కరెంట్ షాక్‌తో చనిపోయింది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రపూర్‌ జిల్లా సమీపంలో ఉన్న సిందేవాహి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలోనే చిరుత అక్కడున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఒక కోతి ఉండడం గమనించింది.

ఆహారం కోసం కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ చిరుత పులి, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కోతిపైకి దూకిన చిరుత ట్రాన్స్‌ఫర్‌పై పడి కరెంట్ షాక్‌తో చనిపోయింది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రపూర్‌ జిల్లా సమీపంలో ఉన్న సిందేవాహి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలోనే చిరుత అక్కడున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఒక కోతి ఉండడం గమనించింది. దాన్ని వేటాడేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి ఎక్కింది. దీంతో విద్యుదాఘాతానికి గురై కోతితో సహా చిరుతపులి కూడా మృతి చెందింది. ట్రాన్స్‌‌ఫార్మర్‌పై చిరుత మృతదేహం వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ, విద్యుత్‌ శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విగతజీవులుగా పడి ఉన్న జంతువులను కిందకు దించారు. గతంలోనూ గోండియా జిల్లాలో కరెంట్‌ షాక్‌కు గురై ఓ చిరుతపులితో పాటు దాని రెండు పిల్లలు మృతి చెందాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాడేరు మంచు అందాలు.. మేఘాలకొండకు పెరిగిన పర్యాటకుల తాకిడి

ఆ విమానాల్లో ప్రయాణించొద్దు.. భారతీయులకు పన్నూ వార్నింగ్

భార్యకోసం భర్త త్యాగం.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా

మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్‌ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌లు..

ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??

 

Follow us on