అమానుషం.. యాచకుడి డబ్బు దోచేసిన దుండగులు !! చివరికి ??
కర్నూలు లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేసుకుని జీవిస్తున్న వ్యక్తి డబ్బును అపహరించారు ఇద్దరు వ్యక్తులు. అనారోగ్యంతా బాధపడుతున్న ఆ యాచకుడు తన డబ్బు పోవడంతో లబోదిబోమన్నాడు.
కర్నూలు లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేసుకుని జీవిస్తున్న వ్యక్తి డబ్బును అపహరించారు ఇద్దరు వ్యక్తులు. అనారోగ్యంతా బాధపడుతున్న ఆ యాచకుడు తన డబ్బు పోవడంతో లబోదిబోమన్నాడు. విషయం కొందరు గ్రామస్తులతో చెప్పగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక దర్గాలో ఉండే ఇద్దరు వ్యక్తులు తన డబ్బును అపహరించారని తెలిపాడు. 40 ఏళ్లుగా భిక్షాటన చేసి సంపాదించుకున్న దాదాపు 4 లక్షల రూపాయలను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాచకుడిని బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును తహశీల్దారుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దడదడలాడించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే !!
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

