తందూరి రోటీ కోసం పెళ్లిలో గొడవ ఇద్దరు యువకులు మృ**తి

Updated on: May 11, 2025 | 9:36 AM

ఉత్తరప్రదేశ్‌లోని అమోదిలోని వివాహ వేడుకలో మొదటి తందూరి రొట్టె ఎవరు తింటారనే వివాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన తర్వాత పెళ్లి జరిగిన ఆనందం కాస్త దుఃఖంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. అలాగే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి కుటుంబం దయనీయ స్థితిలో ఉంది. యువకులు కుటుంబ సభ్యులు ఏడుస్తూనే ఉన్నారు. అమోదిలోని బలభద్రపూర్ గ్రామంలో రాం జీవన్ వర్మ ఇంట్లో అమ్మాయి వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపు వచ్చేవరకు పెళ్లి తంతు అంతా బాగానే జరిగింది. అందరూ పెళ్లి సన్నాహాలతో బిజీగా ఉన్నారు. ఇంతలో విందు మొదలైంది. వంటవాళ్లు తందూరి రొట్టెలు పెట్టగానే రవికుమార్ అలియాస్ కల్లు, ఆశీష్‌కుమార్ మధ్య ఎవరు ఎక్కువ రొట్టెలు తింటారనే పోటీ మొదలైంది. అదే గొడవకు దారితీసింది. వివాదం ఎంత పెరిగిందంటే యువకులు ఇద్దరూ కర్రలు, రాడ్లతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ వివాదంలో ఆశీష్ వర్మ అక్కడిక్కడే మరణించగా రవిని చికిత్స కోసం లక్నో ట్రామా సెంటర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘటన వార్త తెలియగానే రెండు కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. తమ పనిలో బిజీగా ఉన్నప్పుడు గొడవ జరిగినట్లు తమకు తెలిసిందని రాం జీవన్ వర్మ అన్నారు. మొదటి రొట్టె ఎవరు తీసుకుంటారనే దానిపై ఇద్దరి మధ్య బాధన జరిగిందని తాము అక్కడికి చేరుకున్నప్పటికే ఇద్దరూ గొడవ పడుతున్నారని తెలిపారు. వారిద్దరినీ విడదీసామని అయితే అప్పటికే ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాహ ఊరేగింపు సమయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగిందని అందులో ఇద్దరూ మరణించారని గౌరీగంజ్ సర్కిల్ సీఐవో అఖిలేష్ వర్మ తెలిపారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంటి దురదను వదిలించుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ !

ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా ?? ఇదిగో క్లారిటీ

భార్య ముక్కు అందంగా ఉందని కొరికిన భర్త

రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

ఇది మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.. మోతాదు మించితే హానికరం