కరెంట్‌ స్విచ్‌బోర్డ్‌లో దొరికిన 15 కోట్ల విలువైన వజ్రం

|

Aug 17, 2023 | 10:08 PM

1979లో సత్యజిత్‌రే డైరెక్షన్‌లో వచ్చిన జోయ్‌ బాబా ఫెలూనాథ్‌ బెంగాలీ మూవీ గుర్తుందా? డిటెక్టివ్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్‌ డూపర్‌ హిట్‌. ఈ సినిమాలో ఓ ఖరీదైన వజ్రాన్ని దొంగిలిస్తారు. చివరకు అది దుర్గామాత కూర్చున్న సింహం బొమ్మ నోటిలో దొరుకుతుంది. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి కోల్కత్తాలో జరిగింది. అవును, కరెంట్ స్విచ్ బోర్డులో 15కోట్ల ఖరీదైన వజ్రం దొరికింది. దీంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. 2002లో కోల్‌కతాకు చెందిన ప్రణబ్ కుమార్ అనే వ్యక్తి వద్ద ఖరీదైన వజ్రం ఉండేది.

1979లో సత్యజిత్‌రే డైరెక్షన్‌లో వచ్చిన జోయ్‌ బాబా ఫెలూనాథ్‌ బెంగాలీ మూవీ గుర్తుందా? డిటెక్టివ్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్‌ డూపర్‌ హిట్‌. ఈ సినిమాలో ఓ ఖరీదైన వజ్రాన్ని దొంగిలిస్తారు. చివరకు అది దుర్గామాత కూర్చున్న సింహం బొమ్మ నోటిలో దొరుకుతుంది. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి కోల్కత్తాలో జరిగింది. అవును, కరెంట్ స్విచ్ బోర్డులో 15కోట్ల ఖరీదైన వజ్రం దొరికింది. దీంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. 2002లో కోల్‌కతాకు చెందిన ప్రణబ్ కుమార్ అనే వ్యక్తి వద్ద ఖరీదైన వజ్రం ఉండేది. అది ఎంత ధర ఉంటుంందో తెలుసుకుందామని అతడు ఇంద్రజిత్ తపాదార్ అనే ఓ వక్తిని కలిశాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ మరో వ్యక్తితో కలిసి ప్రణబ్ ను భయపెట్టి వజ్రాన్ని కొట్టేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంద్రజిత్ ఇంట్లో వెతికారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో కొన్నాళ్లపాటు ఈ అన్వేషణ సాగింది. ఎట్టకేలకు ఓ కరెంట్ స్విచ్ బోర్డులో వజ్రం కన్పించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రికెట్‌లో మెరుపులు కురిపిస్తున్న పోలీస్‌ !! బౌలింగ్‌తో బ్యాటర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన పోలీసు

పట్టాలపై పిల్లాడు.. స్పీడుగా వస్తున్న రైలు.. తర్వాత ఏం జరిగిందంటే ??

కళ్లెదుటే ఎలుగుబంటి.. తెలివిగా తప్పించుకున్నారిలా !!

భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు ?? షాకింగ్‌ వీడియో

 

Follow us on