మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు వీడియో
దేశంలోని మెట్రో నగరాల్లో సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య సీట్ల విషయంలో తీవ్రమైన వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన ఇతర ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో లక్షలాది మంది ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మెట్రో రైళ్లను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా బస్సులు లేదా రైళ్లలో సీట్ల కోసం గొడవలు సర్వసాధారణం. అయితే, ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్లలో కూడా సీట్ల విషయంలో తీవ్ర వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ సంఘటన ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో చోటుచేసుకుంది. సీట్ల విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన వాగ్వాదం ప్రారంభమై, చివరికి శారీరక దాడికి దారితీసింది. ఒక యువకుడు చేయి ఎత్తి దాడి చేయడానికి ప్రయత్నించగా, అవతలి వ్యక్తి అతడిని బలంగా తన్ని కిందపడేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
