వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పట్టపగలు చైన్ స్నాచింగ్ చోరీ ఉదంతం కలకలం రేపుతుంది. జోగిపేట పట్టణంలోని సత్యసాయి కాలనిలో వృద్ధురాలు మెడలో నుండి నాలుగు తులాల బంగారం పుస్తెల తాడును లాక్కెళ్లారు దుండగులు. ఇంట్లో ఉన్న శంకరంపేట మణెమ్మ అనే వృద్ధురాలి కంళ్లలో కారం కొట్టి దొంగలించారు.గమనించిన కూతురు వెంకట లక్ష్మీ అడ్డుకునే ప్రయత్నం చేసిన దుండగుడు తోసేసి బైక్ పై పరార్ అయ్యారు. వృద్ధురాలు శంకరమ్మ కూతురు దగ్గర గత కొన్ని రోజులుగా ఉంటుంది. కూతురు వెంకటలక్ష్మి దుండగులన్నీ వెంబడించిన ఫలితం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేసింది.స్థానికుల పిర్యాదుతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న జోగిపేట సిఐ అనిల్ కుమార్ ఎస్సై పాండు వెతికిన దుండగుల జాడ తెలిసిరాలేదు. బాధితురాలి నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు