వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది
దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలో పట్టాలెక్కనుంది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు, వేగవంతమైన ప్రయాణాన్ని రైలు ప్రయాణికులకు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కిస్తోంది. ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ-పాట్నా మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఎంతవరకు నిజం అనేది.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టం అవుతుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందున.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారి కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఒక వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం అయిందని.. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్లో సక్సెస్ అయినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 15 వరకు రెండో రైలు కూడా పూర్తి అవుతుందని ఈ రెండు రైళ్లు సిద్ధం అయిన తర్వాత.. వాటిని ఒకేసారి ప్రారంభించినున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒకేసారి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించడానికి గల కారణాన్ని కూడా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు నిరంతరంగా ప్రయాణికులు సేవలు అందించాలంటే.. ఒక రైలు సరిపోదని.. అందుకు రెండు రైళ్లు అవసరం అవుతాయని చెప్పారు. అందుకే రెండో రైలు పూర్తి అయ్యేవరకు వేచి చూస్తున్నట్లు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంతంటే..
పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది
తెలంగాణకు డబుల్ అలర్ట్ పొంచి ఉన్న అతి భారీవర్షాలు
ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం
GST Reforms 2025: జీఎస్టీ తగ్గింపు ఇవ్వటం లేదా? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

