సొరంగంలో కార్మికులు బయటపడేదెట్టా ??

Updated on: Nov 25, 2023 | 9:29 PM

ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి.నిన్న సాయంత్రానికి అందర్నీ రక్షిస్తామని అధికారులు ప్రకటించారు కాని.. అది కుదరలేదు.. తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. అయితే చిన్న సొరంగాన్ని డ్రిల్‌ చేస్తున్న సమయంలో.. మిషనరీ ఓ ఇనుమ మెష్‌లోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ ఐరన్‌ లాటిస్‌ గిర్డర్‌ని డ్రిల్లింగ్‌ మెషీన్ల ద్వారా తీయాలని చూస్తే.. పెను ప్రమాదం తప్పదు.

ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి.నిన్న సాయంత్రానికి అందర్నీ రక్షిస్తామని అధికారులు ప్రకటించారు కాని.. అది కుదరలేదు.. తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. అయితే చిన్న సొరంగాన్ని డ్రిల్‌ చేస్తున్న సమయంలో.. మిషనరీ ఓ ఇనుమ మెష్‌లోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ ఐరన్‌ లాటిస్‌ గిర్డర్‌ని డ్రిల్లింగ్‌ మెషీన్ల ద్వారా తీయాలని చూస్తే.. పెను ప్రమాదం తప్పదు. ఇప్పుడు రక్షించే పనులకు తోడు.. మరింత ప్రమాదంలోకి కార్మికులను నెట్టే అవకాశాలుండడంతో.. అక్కడితో రెస్క్యూ పనులను ఆపేశారు. కార్మికులను రక్షించేందుకు ఈ రెండు వారాల్లో 47 మీటర్ల దూరం తవ్వారు అధికారులు. ఇంకా పదిమీటర్ల మేర తవ్వాల్సిఉంది. ఈనేపథ్యంలో పనులకు మరోసారి ఆటంకం కలగడం.. ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చిన్న సొరంగం ద్వారా కార్మికులకు మంచినీరు.. ఆహారాన్ని పంపుతున్నారు. ఈరోజు ఆ 22 టన్నుల భారీ డ్రిల్లింగ్‌ యంత్రం బాగైతే.. తిరిగి పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా కుమార్తెకు స్కూల్లో బలవంతంగా గుడ్డు తినిపించారు

మెడలో పొడవాటి కరెన్సీ మాలతో షాకిచ్చిన వరుడు !! అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు

ఇతర దేశాల్లో ఉన్న హమాస్‌ అగ్రనేతలపై కఠిన చర్యలు !!

రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు.. తరువాత ??

సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్న మహిళ !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ ప్రకటన