అన్నా, నన్ను తీసుకుపో, మా అమ్మకు నేను ఒక్కడ్నే కొడుకును అంటూ గల్ఫ్ బాధితుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్నా నువ్వే నన్ను కాపాడాలి అంటూ మంత్రి కేటీఆర్కు సోషల్ మీడియాలో మొర్రపెట్టుకున్నాడు ఆ యువకుడు. బతుకుదెరువు కోసం రెండు నెలలక్రితం దుబాయ్ వెళ్లిన సిరిసిల్ల యువకుడు ఇమ్రాన్, ఏజెంట్ల చేతిలో మోసపోయాడు. ఫ్రీ వీసా అంటూ దుబాయ్ పంపిన కంపెనీ మోసం చేసింది. పంపించేటప్పుడు ఒక పని చెప్పి, అక్కడికి వెళ్లాక మరో పని చేయించడంతో తట్టుకోలేకపోయాడు ఇమ్రాన్. అక్కడ ఉండలేక, ఇండియాకి తిరిగిరాలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్రెండ్స్కి చెప్పుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos