కులూలో పారాగ్లైడింగ్‌ చేస్తూ.. తెలంగాణ యువతి మృతి

|

Feb 12, 2024 | 9:36 PM

హిమాచల్‌ప్రదేశ్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. అక్కడి కులూలో పారాగ్లైడింగ్‌ తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు దుర్మరణం చెందాడు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్‌ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రక్షణ బెల్ట్‌ నాణ్యతను పూర్తిగా చెక్ చేయకుండానే అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై స్పందించిన కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ.. ఇది మానవ తప్పిదం కారణంగానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. అక్కడి కులూలో పారాగ్లైడింగ్‌ తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు దుర్మరణం చెందాడు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్‌ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రక్షణ బెల్ట్‌ నాణ్యతను పూర్తిగా చెక్ చేయకుండానే అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై స్పందించిన కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ.. ఇది మానవ తప్పిదం కారణంగానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పారాగ్లైడింగ్‌ చేసిన ఏరియా, ఎక్విప్‌మెంట్‌కు పర్మిషన్ ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్‌ ఉందన్నారు. వెదర్ ప్రాబ్లమ్స్ కూడా లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పారాగ్లైడింగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. ఘటనకు కారణమైన పారాగ్లైడింగ్‌ పైలట్‌‌పై IPC సెక్షన్‌ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి వివరించారు. మృతిచెందిన టూరిస్టు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్యగా తెలిసింది. మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్‌ చేస్తూ ఆమె ప్రమాదవశాత్తు మృతిచెందారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ – మౌలాలి MMTS రైలు మార్గం రెడీ

ఖతర్‌ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులు విడుదల

విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్‌

అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే

Follow us on