తిరుపతి లడ్డూ కేసులో సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ బెంచ్ ముందు వాదనలు సాగుతున్నాయి. టీటీడీ తరఫున సిద్ధార్థ్ లూథ్రా, ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి సందేహాలు లేవని ముకుల్ రోహత్గి అన్నారు. అటు కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇస్తోన్న సంగతి తెలిసిందే.