రిస్క్ తీసుకుంటున్న శ్రీ విష్ణు వీడియో

Updated on: Oct 05, 2025 | 3:06 PM

సక్సెస్‌ఫుల్ కామెడీ చిత్రాలతో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్గా నిలిచిన శ్రీ విష్ణు, ఇప్పుడు రిస్క్‌తో కూడిన సీరియస్ కథల వైపు అడుగులు వేస్తున్నారు. మృత్యుంజయ్, కామ్రేడ్ కళ్యాణ్ వంటి చిత్రాలతో తన కంఫర్ట్ జోన్‌ను దాటుతున్నారు. భవిష్యత్తులో వినోదాత్మక చిత్రం కూడా చేయనున్నారు.

శ్రీ విష్ణు తన కెరీర్‌లో ఒకప్పుడు సీరియస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, కొన్నాళ్లుగా ఆయన శైలిని మార్చుకుని, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే కామెడీ కంటెంట్‌తో విజయాలు అందుకున్నారు. సామజవరగమన, ఓం భీం బుష్, సింగిల్ వంటి చిత్రాలతో ఆయన కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్గా పేరుపొందారు.అయితే, ఇప్పుడు శ్రీ విష్ణు మళ్లీ పాత దారిలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. విజయాలు కొనసాగుతున్న సమయంలోనే రిస్క్ తీసుకుంటూ సీరియస్ కథలను ఎంచుకుంటున్నారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రాబోతున్న మృత్యుంజయ్ ఒక మర్డర్ మిస్టరీ కాగా, తాజాగా టీజర్ విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ చిత్రం 1992 నాటి నక్సలైట్ నేపథ్య కథతో రూపొందుతోంది. జానకిరామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో