రంజీల్లో ‘శివ’మెత్తిన..క్రికెటర్.. 10 ఫోర్లు, 5 సిక్సులు వీడియో
రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున పేసర్ శివమ్ మావి అద్భుత శతకం నమోదు చేశాడు. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగి 87 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగిన మావికి ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి సెంచరీ కావడం విశేషం.
భారత దేశీయ క్రికెట్లో ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025-26 నాలుగో రౌండ్లో అనేక అద్భుత ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన యువ పేసర్ శివమ్ మావి, తన ఫస్ట్ క్లాస్ కెరియర్లో తొలి సెంచరీని సాధించి రికార్డు సృష్టించాడు.
మరిన్ని వీడియోల కోసం :
