ఐపీఎల్‌లో భారీ ట్రేడ్ డీల్: చెన్నైకి సంజూ.. రాజస్థాన్‌కు జడేజా?

Updated on: Nov 16, 2025 | 5:10 PM

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్నాయి. సంజూ శాంసన్ చెన్నైకి, రవీంద్ర జడేజా రాజస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే, రెండో ఆటగాడి మార్పిడిపై విభేదాలు రావడంతో డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. ధోనీ సహా సీఎస్‌కే యాజమాన్యం జడేజాతో చర్చలు జరిపింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ట్రేడ్ డీల్స్‌లో ఒకటి త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరియు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ చెన్నైకి, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్‌కు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ డీల్‌లో ఒక కీలక అంశంపై చర్చలు ముందుకు సాగడం లేదు. ఏడేళ్లుగా రాజస్థాన్ రాయల్స్‌తో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని సంజూ శాంసన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై ఫ్రాంచైజీకి స్పష్టం చేయడంతో అతడిని ట్రేడ్ చేసేందుకు రాజస్థాన్ సిద్ధమైంది.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో