జనవరి 22న కొత్త ఆలయంలో కొలువుదీరనున్న అయోధ్య శ్రీరాముడిపై కానుకల వర్షం కురుస్తోంది. కానుకల వాహనాలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. శ్రీరాముడి అత్తారిల్లు, సీత జన్మ స్థలం అయిన బిహార్లోని సీతామఢి నుంచి పలు ట్రక్కుల్లో కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. కానుకల్లో బంగారం, వెండి, గృహోపకరణ వస్తువులు ఉన్నట్టు సమాచారం. అల్లుడికి అత్తవారి ఇంటి నుంచి ఇవ్వాల్సిన కానుకలను తెచ్చారు బిహార్ వాసులు. అయోధ్య తరహాలో సీతామాత జన్మభూమిని అభివృద్ధి చేయాలని వారు కోరుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: