ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా.. ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి వీడియో
రష్యా ఉక్రెయిన్పై మరోసారి డ్రోన్లతో దాడి చేసింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్ను, కీవ్కు వెళ్తున్న ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుంది. దీంతో రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు, ప్రపంచ దేశాల చర్యలను కోరారు.
ఉక్రెయిన్పై రష్యా మరోసారి డ్రోన్లతో భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఉక్రెయిన్లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఉన్న ఓ రైల్వే స్టేషన్ను, కీవ్కు వెళ్తున్న ప్రయాణికుల రైలును రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ దాడుల కారణంగా రైలులోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. అయితే, మరణించిన వారి సంఖ్యపై స్పష్టత లేదని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
