RS Praveen Kumar: కవిత ఇష్యూపై ఆచి, తూచి మాట్లాడిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

Updated on: Sep 14, 2025 | 8:39 PM

సామాజిక మార్పులు ఒక్కరోజులో జరగవని, ఒక సామాజిక విప్లవానికి పరిణామ కాలం అవసరమని ప్రవీణ్ కుమార్ వివరించారు. కవిత గారు కొంత ఓపికతో వ్యవహరించాల్సి ఉందని, వారికి సామాజిక తెలంగాణ అభివృద్ధిపై సరైన అవగాహన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కవిత గారిని ప్రభావితం చేస్తున్నాయని కూడా ఆయన సూచించారు.

TV9 క్రాస్ ఫైర్ ప్రోగ్రామ్‌లో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. కల్వకుంట్ల కవిత 163 రోజుల జైలు శిక్ష గురించి, తెలంగాణలోని సామాజిక న్యాయం అభివృద్ధిపై చర్చించారు. కవితకు సామాజిక తెలంగాణపై అవగాహన లేదని, సామాజిక విప్లవం కాలానుగుణంగా మెరుగుపడుతుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలనలో గురుకుల పాఠశాలలు, బీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, దళిత బంధు వంటి ప్రభుత్వ పథకాలను ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కవితను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us