Andhra: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన మహిళ.. ఓ వ్యక్తిని సాయం అడగ్గా
ఓ మహిళ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసేందుకు వెళ్లింది. ఆమెకు డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలియక.. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని సాయం అడిగింది. అతడు డబ్బులు తీసి ఇచ్చాడు. కానీ ఆ తర్వాత జరిగిన దానికి ఆమె నివ్వెరపోయింది.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘరానా మోసం జరిగింది. స్థానిక ఆర్ఆర్ కాంప్లెక్స్లోని ఎస్బీఐ ఏటీఎంలో ఓ మహిళను ఏమార్చి రూ. 32 వేలు కాజేశాడు దుండగుడు. సదరు మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతడు డ్రా చేసి డబ్బులు ఇచ్చే సమయంలో కార్డులు మార్చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రూ. 32 వేలు డ్రా చేసి ఉడాయించాడు. డ్రా చేసినది ఫోన్కు మెసేజ్ రాగా.. తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సదరు మహిళ. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Follow Us
వైరల్ వీడియోలు
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు..
టాయిలెట్ కోసం బ్రేక్ ఇవ్వలేదని దారుణ హత్య..
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

