Andhra: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన మహిళ.. ఓ వ్యక్తిని సాయం అడగ్గా
ఓ మహిళ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసేందుకు వెళ్లింది. ఆమెకు డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలియక.. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని సాయం అడిగింది. అతడు డబ్బులు తీసి ఇచ్చాడు. కానీ ఆ తర్వాత జరిగిన దానికి ఆమె నివ్వెరపోయింది.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘరానా మోసం జరిగింది. స్థానిక ఆర్ఆర్ కాంప్లెక్స్లోని ఎస్బీఐ ఏటీఎంలో ఓ మహిళను ఏమార్చి రూ. 32 వేలు కాజేశాడు దుండగుడు. సదరు మహిళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతడు డ్రా చేసి డబ్బులు ఇచ్చే సమయంలో కార్డులు మార్చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రూ. 32 వేలు డ్రా చేసి ఉడాయించాడు. డ్రా చేసినది ఫోన్కు మెసేజ్ రాగా.. తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సదరు మహిళ. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

