బస్టాండ్ దగ్గర కంగారుగా కనిపించిన ముగ్గురు ప్రయాణీకులు.. వారి బ్యాగులు తెరిచి చూడగా..
రాష్ట్రమంతా ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసినా చెక్పోస్టులు.. పోలీసుల తనిఖీలే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతీ వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ వద్ద.. రోజూలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు.
రాష్ట్రమంతా ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసినా చెక్పోస్టులు.. పోలీసుల తనిఖీలే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతీ వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ వద్ద.. రోజూలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అయితే ఈలోగా వారికి అటుగా బస్టాండ్లోకి వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల(ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి)పై అనుమానం కలిగింది. అలాగే సదరు వ్యక్తులు కూడా ఖాకీలను చూడగానే పరుగులు పెట్టారు. ఏదైతేనేం పోలీసులు సిబ్బంది వారిని వెంబడించి మరీ పట్టుకున్నారు. కట్ చేస్తే.. ఆ ముగ్గురి దగ్గర నుంచి సుమారు రూ. 1.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో ఐటీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు పోలీసులు. కాగా, అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి.. తాడిపత్రిలో అమ్ముతారని గుర్తించారు పోలీసులు.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

