బస్టాండ్ దగ్గర కంగారుగా కనిపించిన ముగ్గురు ప్రయాణీకులు.. వారి బ్యాగులు తెరిచి చూడగా..
రాష్ట్రమంతా ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసినా చెక్పోస్టులు.. పోలీసుల తనిఖీలే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతీ వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ వద్ద.. రోజూలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు.
రాష్ట్రమంతా ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఎక్కడ చూసినా చెక్పోస్టులు.. పోలీసుల తనిఖీలే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతీ వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ వద్ద.. రోజూలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అయితే ఈలోగా వారికి అటుగా బస్టాండ్లోకి వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల(ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి)పై అనుమానం కలిగింది. అలాగే సదరు వ్యక్తులు కూడా ఖాకీలను చూడగానే పరుగులు పెట్టారు. ఏదైతేనేం పోలీసులు సిబ్బంది వారిని వెంబడించి మరీ పట్టుకున్నారు. కట్ చేస్తే.. ఆ ముగ్గురి దగ్గర నుంచి సుమారు రూ. 1.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో ఐటీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు పోలీసులు. కాగా, అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి.. తాడిపత్రిలో అమ్ముతారని గుర్తించారు పోలీసులు.
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

