Andhra: ఫారెస్ట్ ఏరియాలో దూసుకొస్తున్న రెండు కార్లు.. అనుమానమొచ్చి చెక్ చేయగా

Updated on: Sep 11, 2025 | 8:57 PM

ఎర్ర చందనం స్మగ్లర్ల ఆట కట్టించారు తిరుపతి పోలీసులు. పోలీసులు ఓ ప్రాంతంలో కూంబింగ్ చేయగా.. అక్కడ వాహన తనిఖీల్లో అడ్డంగా దొరికారు ఈ కేటుగాళ్లు. మరి ఆ వివరాలు ఏంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్ట వేశారు పోలీసులు. అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేశారు. వారు సానిపాయ, వీరబల్లి ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు దుంగలతో పట్టుబడ్డారు. 15 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. కాగా, పట్టుబడ్డ స్మగ్లర్లు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందినవారుగా గుర్తించారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.