Attack on YS Jagan: సీఎం జగన్పై రాళ్ల దాడి ఘటనపై రాజకీయ రగడ.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం..
ఏపీ సీఎం వైఎస్ జగన్పై శనివారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్పై జరిగిన రాళ్ల దాడి వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై శనివారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్పై జరిగిన రాళ్ల దాడి వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. అటు టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకే టీడీపీ జగన్పై రాళ్ల దాడి ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. జగన్పై దాడి చేసిన వారిని పట్టుకుని, శిక్షింపజేయాలన్న చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. బాధితులు తామైతే.. టీడీపీ నేతలు సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డ్రామాలు చేయాల్సిన అవసరం జగన్కు లేదన్నారు. జగన్కు జనంలో వస్తున్న ఆదరణను చూసి టీడీపీ, జనసేనకు భయం పట్టుకుందని సజ్జల అన్నారు. బోండా ఉమా, సజ్జల కామెంట్స్ ఈ వీడియోలో చూడండి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

