కొనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి కేసీఆర్‌.. ఇదో సెంటిమెంట్‌ ??

Updated on: Nov 03, 2023 | 8:59 PM

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ నవంబర్‌ 3న విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్‌లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా నామినేషన్‌ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ తన మరో సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ నవంబర్‌ 3న విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్‌లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా నామినేషన్‌ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ తన మరో సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్‌కు ఇది సెంటిమెంట్‌ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్‌ వేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల సమయంలోనూ ఇక్కడ పూజలు చేసి నామినేషన్‌ వేశారు. అన్ని సందర్భాల్లోనూ ఘన విజయం సాధించారు. దాంతో కేసీఆర్‌కు ఈ ఆలయం సెంటిమెంట్‌గా మారింది. అంతేకాదు, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటన చేశారు. అప్పటినుంచి తిరుగులేని పార్టీగా విజయపథంలో దూసుకెళ్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానానికి అడ్డంగా వెళ్లిన మహిళ !!

TOP 9 ET News: వామ్మో.. పెళ్లి ఖర్చు..మరీ అన్ని కోట్లా | అమ్మో.. 135 కోట్లు.. ఆగని డబ్బుల లెక్క

ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానో వాయించాడు

Vijay Thalapathy: మీ కాలికింద చెప్పునవుతా.. సూపర్ స్టార్ పొలిటికల్ కామెంట్స్

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us