రేవంత్.. హీరోని అనుకోకు జనం తలచుకుంటే జీరోని చేస్తారు :డీకె అరుణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారంతో కూడుకున్నవని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. డీలిమిటేషన్ పై ఆయన వ్యాఖ్యలు దేశాన్ని విభజించేలా ఉన్నాయన్నారు. ప్రజలే నాయకులను హీరోల నుండి జీరోలుగా మారుస్తారని, 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల డీలిమిటేషన్ ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని, ఒక జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా దేశాన్ని విభజించేలా మాట్లాడటం తగదని ఆమె అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఏ రాష్ట్రానికి నష్టం కలిగించకుండా జరుగుతుందని గతంలోనే అమిత్ షా స్పష్టం చేశారని గుర్తుచేశారు. జలు హీరోలను జీరోలుగా మార్చగలరని, రేవంత్ రెడ్డి కేవలం భ్రమల్లో ఉన్నారని డీకే అరుణ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
Follow Us