ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. గురువారం (మార్చి 23) ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. నష్టపోయిన అన్నదాతలను కలిసి స్వయంగా మాట్లాడారు. స్వయంగా పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కీలక ప్రెస్మీట్ పెట్టారు.