AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర

CM KCR: “డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర”

Ram Naramaneni
|

Updated on: Nov 01, 2023 | 5:03 PM

Share

"డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ. సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర. అది మీకు కనపడతానే ఉంది. విడిపోతే మీకు బ్రతకడం వస్తదా, మీకు పరిపాలన చేయడం తెల్సా అన్నారు. వాళ్లే మనదగ్గరికి వచ్చి ఇవాళ వరిధాన్యం అమ్ముకుంటున్నారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు... తెలంగాణ ఇస్తే.. మీరు చీకట్లోకి వెళ్తారు అని చెప్పిండు. ఈ రోజు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నయ్. వాళ్లే చీకట్లో ఉన్నారు" అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. రోజూ రెండు, మూడు సభల్లో పాల్గొంటూ… ప్రతిపక్షాలపై మాటల తూటాలు దించుతున్నారు. తాజాగా సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ అభివృద్ది గురించి మాట్లాడుతూ ఏపీపై కీలక కామెంట్స్ చేశారు.

“మనం ఎవరితో అయితే విడిపోయామో.. అదే బోడర్‌లో మీరు(సత్తుపల్లి ప్రజలు) ఉన్నారు. వాళ్ల రోడ్లు ఎట్ల ఉన్నాయో, మనం రోడ్లు ఎట్లా ఉన్నాయో..చూడండి. అదే నిదర్శనం ఇక. నేను ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. మీరు రోజు అటువైపు పోతారు, వస్తారు. నిత్యం సబంధాలు ఉంటాయి. డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ. సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర. అది మీకు కనపడతానే ఉంది. విడిపోతే మీకు బ్రతకడం వస్తదా, మీకు పరిపాలన చేయడం తెల్సా అన్నారు. వాళ్లే మనదగ్గరికి వచ్చి ఇవాళ వరిధాన్యం అమ్ముకుంటున్నారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు… తెలంగాణ ఇస్తే.. మీరు చీకట్లోకి వెళ్తారు అని చెప్పిండు. ఈ రోజు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నయ్. వాళ్లే చీకట్లో ఉన్నారు” అని కేసీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 01, 2023 05:00 PM