Watch Video: నారా భువనేశ్వరి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు.. అక్కడి నుంచి యాత్రకు శ్రీకారం
చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై నెలన్నర రోజులు అయిన నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి నుంచి ఆమె తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లాలో మూడ్రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు.
చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారయ్యింది. తిరుపతి జిల్లాలో మూడ్రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. మంగళవారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు. మంగళవారం తిరుపతిలోనే నారా భువనేశ్వరి బస చేస్తారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లికి చేరుకుని.. అక్కడి నుంచి నిజం గెలవాలిపేరిట టీడీపీ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజున రాత్రి నారావారి పల్లిలోనే బస చేస్తారని మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుందని వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారని తెలిపారు.
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..
రీల్ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్ నోటీసులు..

