Watch Video: నారా భువనేశ్వరి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు.. అక్కడి నుంచి యాత్రకు శ్రీకారం
చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై నెలన్నర రోజులు అయిన నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి నుంచి ఆమె తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లాలో మూడ్రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు.
చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారయ్యింది. తిరుపతి జిల్లాలో మూడ్రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. మంగళవారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు. మంగళవారం తిరుపతిలోనే నారా భువనేశ్వరి బస చేస్తారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లికి చేరుకుని.. అక్కడి నుంచి నిజం గెలవాలిపేరిట టీడీపీ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజున రాత్రి నారావారి పల్లిలోనే బస చేస్తారని మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుందని వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారని తెలిపారు.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

