తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆంధ్రా – తెలంగాణ అంటూ సరికొత్త లొల్లి మొదలైంది. ఇటీవలే సజ్జల చేసిన వ్యాఖ్యలతో మళ్లీ సమైక్య కుట్రలు మొదలయ్యాయన్న విమర్శలు తెలంగాణ నుంచి బలంగా వినిపించాయి. ఇది ఇంకా సజీవంగా ఉండగానే చంద్రబాబు సభ కూడా మరింత ఆజ్యం పోసింది. డెవలప్ అవుతున్న తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్రావాళ్లు మళ్లీ వస్తున్నారని గంగుల సంచలన వ్యాఖ్యలతో పల్లవి ఆలపిస్తే.. షర్మిల, చంద్రబాబు, పవన్, పాల్ అంతా కూడా బీజేపీ వదిలిన బాణాలేనంటూ ఇతర మంత్రులు చరణాలు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తన గొడవలో తానుండి ఎలాగూ స్పందించదు.. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కూడా సైలెంట్గా ఉండటం వెనక తమ అనుమానం నిజమేనేమో అంటున్నారు గులాబీ శ్రేణులు.