ఏపీలో రైతులందరికీ గుడ్న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు
ఏపీ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఫిబ్రవరిలో రైతులకు రూ. 6,000 జమ కానున్నాయి. పంట పెట్టుబడి కోసం నిధులు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్త. రేషన్ కార్డు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న కుటుంబంలోని ఒకరికి ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తు మరియు స్టేటస్ చెక్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బుల కోసం ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా? అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పంట సీజన్ మొదలు కావడంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు జమ అవుతాయనేది చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలో రూ.6 వేలు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.14 వేల చొప్పున జమ చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ డబ్బులను జమ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణెడ్డి రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఫిబ్రవరిలో ఖాతాల్లోకి నిధులు విడుదల చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పెట్టుబడి కోసం డబ్బులు అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అన్నదాత సుఖీభవ పథకం తరపున ఏడాదికి రూ.20 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటిని మూడు విడతలుగా ఇస్తోంది. తొలి రెండు విడతల్లో రూ.7 వేలు, మూడో విడతలో రూ.6 వేలు అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రేషన్ కార్డు, 5 ఎకరాల్లోపు పోలం ఉన్నవారికి మాత్రమే ఈ పధకం వర్తింపచేస్తోంది. అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పధకం కూడా లబ్ది పొందే అవకాశముంది. గ్రామ సచివాలయాల ద్వారా ఈ పథకానికి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు స్టేటస్ను అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
Whatsapp: బీ అలర్ట్.. భయపెడుతున్న వాట్సాప్ హ్యాక్ స్కామ్