అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలకు చెరువులకు వరద పోటెత్తుతోంది. పలు ప్రాంతాలు జల గిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో వరద పొంగి పొరలు తున్న చెరువు వద్ద జనం చేపలకోసం ఎగబడుతున్నారు. ఓ వైపు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా చేపలకోసం పీట్లు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వడమాల పేట మండలం ఎస్బీఆర్ పురంలోని గులూరు చెరువు వరద పోటెత్తడంతో పొంగి ప్రవహిస్తోంది. దాంతో ఈ వరదలో కొట్టుకొస్తున్న చేపల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. చేపలను పట్టేందుకు కుస్తీలు పడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..