‘తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న’ అక్భరుద్దీన్ ఓవైసీ.. ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు..
సీబీఐ, ఈడీ పేరు చెప్పి బీజేపీ భయపెట్టాలని చూస్తోందని అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు త్యాగాలతో హైదరాబాద్ను దక్కించుకున్నాం.. ఇప్పుడు బీజేపీ నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సోదరులిద్దరినీ జైలుకు పంపి.. స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీపై టార్గెట్ చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ 5 వ సారి పోటీ చేస్తున్నారన్నారు.
సీబీఐ, ఈడీ పేరు చెప్పి బీజేపీ భయపెట్టాలని చూస్తోందని అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు త్యాగాలతో హైదరాబాద్ను దక్కించుకున్నాం.. ఇప్పుడు బీజేపీ నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సోదరులిద్దరినీ జైలుకు పంపి.. స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీపై టార్గెట్ చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ 5 వ సారి పోటీ చేస్తున్నారన్నారు. గత 4 లోక్ సభ ఎన్నికల నుంచి 2004,2009, 2014,2019 ఎన్నిక్లలో ఇక్కడ నుంచి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా విజయం సాధిస్తున్నారన్నారు. తన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ గెలుపు కోసం కోసం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాత బస్తీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికులను ఉద్దేశించి అక్బరుద్దీన్ మాట్లాడారు. ముస్లింలపై దాడులు జరిగితే ఎవరూ ముందుకు రారని.. కనీసం ఎవరూ ఖండించరని పేర్కొన్నారు. తమకు తామే రక్షణ కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్బరుద్దీన్ అన్నారు. 20 ఏళ్లుగా పాతబస్తీ అభివృద్ధి కోసం తన సోదరుడు అసదుద్దీన్ కృషి చేస్తున్నారని.. ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అక్బరుద్దీన్ అన్నారు. అసదుద్దీన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పాతబస్తీ ప్రజలకు అక్బరుద్దీన్ పిలుపు ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

