PM Modi in Bhutan: ప్రధాని మోదీకి భూటాన్లో స్వీట్ సర్ప్రైజ్
ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్ గ్యాల్పో’ను ఆయన అందుకున్నారు. భూటాన్కు చేరుకొన్నాక మోదీ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక వేడుకల్లో భారతీయ సంస్కృతి, పాటలు ప్రముఖంగా కనిపించాయి. గుజరాతీ, హిందీ పాటలకు కళాకారులు నృత్యాలు చేశారు.
2 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం భూటాన్ వెళ్లారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశంలో అపూర్వ స్వాగతం లభించింది. రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరువుతున్నారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్యూక్ గ్యాల్పో’ను మోదీ అందుకున్నారు. ఆ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
కాగా ప్రధాని గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గుజరాతీ, హిందీ పాటలకు కళాకారులు నృత్యాలు చేశారు. వారి ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా తిలికించారు. ఆ దృశ్యాలు ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2014లో భారత ప్రధానిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

