తెలంగాణ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోంది: ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్లో జరిగే పబ్లిక్ మీటింగ్కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పాలమూరు జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు వెళ్లారు. అక్కడ అమిస్తాపూర్ శివారులోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం 5.15 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్లో జరిగే పబ్లిక్ మీటింగ్కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్

